ప్రధాని మోదీ ఇవాళ యూపీలో పర్యటించనున్నారు. అజంగఢ్, జౌన్పూర్, భదోహి, ప్రతాప్గఢ్లలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు హుస్సేన్పూర్ బరాగావ్ ఫరియాలో ఏర్పాటు చేసిన సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. అనంతరం జౌన్పూర్లోని టీడీ కళాశాల మైదానంలో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.