ఎలక్టోరల్ బాండ్ల విషయంలో
బీజేపీ వ్యవహరించిన తీరుపై
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ మరోమారు స్పందించారు. ‘ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యవస్థ పారదర్శకంగా మారిందని ప్రధాని
మోదీ అన్నారు. అలాంటప్పుడు ఈ రహస్య విరాళ పథకాన్ని ఎందుకు తెచ్చారు? న్యాయస్థానం కఠినంగా వ్యవహరించి దాతల జాబితా విడుదల చేయడంతో అవినీతి అంతా వెలుగులోకి వచ్చింది. దేశానికి ఎంతద్రోహం జరిగిందో ప్రజలకు తెలియాలి’ అని పేర్కొన్నారు.