దేశంలో లోక్సభ ఎన్నికల హీట్ పెరుగుతోంది. రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు విమర్శ ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వయనాడ్లో ప్రచారం నిర్వహించిన
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానన్న
మోదీ, సొంత దేశంలో నిరుద్యోగాన్ని ఎందుకు పారదోలలేకపోయారని ప్రశ్నించారు. ముందు దీనికి సమాధానం చెప్పాలని కోరారు.