పేదోళ్ల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే, అది ఒక్క
కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. నుంగునూరు కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. గతంలో
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు, భూములు ఇవ్వడం జరిగిందన్నారు. పదేండ్లు అధికారంలో ఉన్న బిజెపి, బీఆర్ఎస్ పాలకులు పేద వర్గాలకు చేసిందేమీ లేదన్నారు. ఆయా పార్టీలు డబ్బున్న వారికే కొమ్ము కాశారని విమర్శించారు. కనీసం యువతకు ఉద్యోగాలను కూడా ఇవ్వలేకపోయారని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు అయిన
కాంగ్రెస్ ప్రజాపాలనలో
ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పేద వర్గాలకు మేలు జరగాలంటే ఈ దేశంలో
ఇండియా కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే, ఎల్లవేళల ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ఈ మెదక్ ప్రాంత అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.