కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పార్లమెంట్ వెలుపల ప్లకార్డులతో నిరసన తెలిపారు. తమిళనాడు ఎంపీలకు కామ్రెడ్ సుదామ ప్రసాద్, విసికె, ఐఎన్సిలకు చెందిన నేతలు సంఘీభావం ప్రకటించారు. ఎన్ఇపి అమలు చేయడానికి తమిళనాడు నిరాకరించినందుకు మోడీ ప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని శిక్షించాలనుకోవడం దారుణమన్నారు.