కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ ఏబీవీపీ ఆరోపించింది. తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ్ను కాలేజిలోనే దారుణంగా హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్షను విధించాలంటూ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనకు దిగారు. బెంగళూరు ఎస్బీఎం కూడలిలో ధర్నా సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ఘటనలు ఎక్కువ అయ్యాయని ఆందోళనకారులు ఆరోపించారు.