ఇండోర్ నగరంలో ఈ నెల 10న షాకింగ్ ఘటన జరిగింది. సర్వతే బస్టాండ్లో టికెట్ బుకింగ్ ఉద్యోగి రాకేష్ సేని వద్దకు రాజేష్ అనే వ్యక్తి వచ్చాడు. తాను 5 రైడ్లు తీసుకొచ్చానని, తనకు కమీషన్ ఇప్పించాలని కోరాడు. దానికి రాకేష్ నిరాకరించాడు. తనకు కమీషన్ విషయాలు తెలియదని బదులిచ్చాడు. కోపంలో నిందితుడు పూలకుండీని రాకేష్ తలపైకి విసిరాడు. అదృష్టవశాత్తూ రాకేష్కు తీవ్రమైన గాయాలు కాలేదు. నిందితుడి పరారీలో ఉన్నాడు.