సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుకు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పి.వి చిత్రపటానికి పూలమాల వేసి సీఎం నివాళులు అర్పించారు. ఉమ్మడి ఏపీ సీఎంగా, కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని రేవంత్ పేర్కొన్నారు.