కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కొత్త లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనం కానుంది. సమావేశం అనంతరం రాత్రి ఎంపీలకు రాహుల్ విందు ఇవ్వనున్నారు. కాగా, లోక్సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశంలో జరుగబోతోంది.