జర్నలిజానికి గుర్తుగా రామోజీ రావు నిలిచిపోతారు: KTR (వీడీయో)

82చూసినవారు
తెలుగు పత్రికా రంగం, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడు రామోజీరావు అని కేటీఆర్‌ అన్నారు. ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించి మాట్లాడారు. విలువలతో కూడిన జర్నలిజానికి గుర్తుగా రామోజీ రావు నిలిచిపోతారని అన్నారు. 'ఈనాడు, ఈటీవీతో తనదైన ముద్ర వేశారు. ఎల్లవేళలా తెలుగు రాష్ట్రాలు, దేశం బాగుండాలని తపించేవారు. తెలుగు భాషను అభిమానించిన విధానం, తపన అందరికీ ఆదర్శం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్