కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం ఫలాలు గ్రామ గ్రామాన చేరాలంటే భాజాపాకు ఓటు వేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని చేవెళ్ల పార్లమెంటు భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో కొనసాగుతున్న ప్రజా ఆశీర్వాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి చెందాలంటే బిజెపితోనే సాధ్యమన్నారు.