ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన మహిళ అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లా పూర్ మెట్ మండలంలో పిగ్లీపూర్ గ్రామానికి చెందిన దాసరి కవిత కుమార్తె వైష్ణవితో ఈ నెల 21న ఫోన్లో మాట్లాడారు. గురువారం సాయంత్రం మళ్లీ ఫోన్ చేయగా స్వీచ్ ఆఫ్ వస్తుండడంతో మరుసటి రోజు ఇంటికి వచ్చి ఆమె చూడగా తాళం వేసి ఉంది. తల్లి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.