అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రం జన్నురం కాలనీ వాసి వెంకటాచారి నిరుపేద కుటుంబానికి చెందిన వాడు తన కుమార్తె వివాహానికి సాయం చేయమని సురక్ష సేవా సంఘం కు సంప్రదించడం జరిగింది. వెంటనే స్పందించిన సంఘ రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్ పెండ్లి ఖర్చులు నిమిత్తం బుధవారం 5000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సలహా దారులు నాగవల్లి యాదగిరి, ఎక్జిక్యూటివ్ సభ్యులు అచిని మహేష్ పాల్గొన్నారు.