సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్

83చూసినవారు
సైబర్‌ నేరగాళ్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేశారు. ముఠాలో ఉన్న 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 435 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు సైబర్ నేరాలు చేసి రూ.7 కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఈడీ, సీబీఐ అధికారులమని చెప్పి ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా.. వారి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును ఫ్రీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్