ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిని చేయాలని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగా రెడ్డి పిలుపునిచ్చారు. నాగోల్ డివిజన్ బండ్లగూడలో బీజేపీ నాయకుడు సుర్వి రాజుగౌడ్ అనుచరులు ఆదివారం బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చింతల సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.