పనులను వేగవంతం చేయండి: కార్పొరేషన్ చేర్మెన్

82చూసినవారు
పనులను వేగవంతం చేయండి: కార్పొరేషన్ చేర్మెన్
జల్ పల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల మరమ్మతులను త్వరితగతిన చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది అధికారులను ఆదేశించారు. ఆయా పనులకు సంబంధించి నిధులు కూడా మంజూరు చేశామన్నారు. చైర్మన్ సాది అధ్యక్షతన బుధవారం జల్ పల్లి మున్సిపాలిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీ నిర్వహణ, బోనాలు, వినాయక చవితి పండుగలకు సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలకు పాలకవర్గం సభ్యులు ఆమోదం తెలిపారు.

సంబంధిత పోస్ట్