రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ లభ్యం

2267చూసినవారు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విశ్వాసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీస్ సిబ్బంది వారు డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అతని వద్దనుండి 15 గ్రాముల ఎండీ. ఎం. ఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ విలువ సుమారుగా 2, 25, 000/- రూపాయలుగా ఉంటున్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్