మియాపూర్ మయూరి నగర్ కాలనీ దివ్యశ్రీ శక్తి అపార్ట్మెంట్ లో సాయి సింధూర(29) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ భర్త, కుమారుడితో ఉంటోంది. గత కొంత కాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. మనస్తాపానికి గురైన ఆమె శుక్రవారం మధ్యాహ్నం అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.