ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక: సునీతా

76చూసినవారు
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతా రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ అల్లాపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్థానిక కాంగ్రెస్ ఇంచార్జీ బండి రమేష్ తో కలిసి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్