పాలమూరు ఎత్తిపోతల పథకం పై కాంగ్రెస్ అబద్దాలను ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటో చెప్పాలని మీడియా ముఖంగా డీకే అరుణ నిలదీశారు. మహబూబ్ నగర్ లోని ఏడు నియోజకవర్గాలలో 8 లక్షల ఎకరాలు సాగు చేసేందుకు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెచ్చిందని అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.