మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి కొనియాడారు. గురువారం షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ. అంటరానితనం, కుల వ్యవస్థ, అణగారిన కులాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదని అన్నారు.