వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. "వైసీపీ అధికారం చేపట్టాక మైనార్టీలపై జరిగిన దాడులు కోకొల్లలు. నాలాంటి వాడినే ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. వారికి సామాన్యులు ఓ లెక్కా. నంద్యాల జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా వైసీపీ నేతలు వేధించారు. ఓట్ల కోసం సీఎం జగన్ దొంగ జపం చేస్తున్నారు.. మోసపోవద్దు." అని ఆయన పేర్కొన్నారు.