షాద్నగర్ పట్టణ అభివృద్ధి విషయంలో ప్రజలు, భవన యజమానులు మున్సిపాలిటీకి సహకరించాలని చైర్మన్ కే. నరేందర్ సోమవారం స్పష్టం చేశారు. అభివృద్ధి అంశంలో ప్రతి ఒక్కరు సహకరిస్తేనే భవిష్యత్ తరాలకు అన్ని మౌలిక సదుపాయాలు ఉంటాయని, అందరూ ఇలా ఖచ్చితంగా ఆలోచిస్తే వసతుల విషయంలో భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వారం అవుతామని చైర్మన్ నరేందర్ తెలిపారు. అభివృద్ధికి అందరూ ప్రాధాన్యత ఇచ్చే విధంగా స్పందించాలని అన్నారు.