మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు

56చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని హజరత్ సయ్యద్ అబ్బాషా ఖాద్రీ చిస్తీ ఉర్ఫియాత్ పీర్ గయాబ్ షా దర్గాలో సోమవారం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్సు ఉత్సవాల్లో భాగంగా దర్గాను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మతసామరస్యాలకతీతంగా తెలంగాణ ప్రజలు తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారని, దర్గాలు వరుస ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్