మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడిని హీరోయిన్ రాశీ ఖన్నా, బాలీవుడ్ నటి వాణీ కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రాశీ ఖన్నా మహాకాళేశ్వరుడి తొలి పూజలో పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ భగవంతుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాశీ ఖన్నా అన్నారు. ఇది ఒక గొప్ప అనుభూతని నటి వాణీ కపూర్ వెల్లడించారు.