బ్యాంకులు లాభాల కోసం రిస్క్లు తీసుకోవడం మానుకోవాలని RBI గవర్నర్ శక్తికాంత దాస్ హితవు పలికారు. బ్యాంకులు లాభాల కోసం కొన్ని రకాల రిస్కలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇలాంటి చర్యలతో ఏమాత్రం లాభాలు రావని అభిప్రాయపడ్డారు. సంక్షోభాలను ముందే పసిగట్టి వాటిని నివారణ చర్యలు తీసుకోవడమే RBI బాధ్యతని దాస్ అన్నారు. అలాగని ప్రతి సందర్భంలో సంక్షోభాలను గుర్తించలేమని.. కానీ, వంద శాతం ప్రయత్నిస్తామన్నారు.