పరిమితికి మించిన శబ్ద కాలుష్యం నమోదు

65చూసినవారు
పరిమితికి మించిన శబ్ద కాలుష్యం నమోదు
హైదరాబాద్ నగరవ్యాప్తంగా చూస్తే.. జూబ్లీహిల్స్‌ నివాసిత ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. శబ్ద తీవ్రత 70 డెసిబుల్స్‌ దాటితే చెవుడు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటిది జూబ్లీహిల్స్ ప్రాంతంలో అత్యధికంగా 76.25 -78.52 డెసిబుల్స్‌గా నమోదైందని ఇటీవల పీసీబీ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. ఈ ప్రాంతంలో నివసిస్తే చెవుడు రావటం మాత్రం గ్యారంటీ అని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్