ఏపీలోని మల్టీప్లెక్స్లు, మాల్లలో వాహన పార్కింగ్ రుసుములను కూటమి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. మొదటి అర గంట వరకు పార్కింగ్ ఫీజు వసూలు ఉండదని, ఆ తర్వాత బిల్లులు, సినిమా టికెట్లు చూపాలని ఉత్తర్వులు జారీ చేసింది. గంట వరకు పార్కింగ్ చేసిన వ్యక్తులు బిల్లులు చూపనట్లయితే వసూలు చేయొచ్చు. గంటకుపైగా పార్కింగ్ చేస్తే, సినిమా టికెట్, బిల్లులు చూపినట్లయితే ఉచితం. కాగా వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.