తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిషేధం అమల్లో ఉంది. వీటితో పాటు అస్సాం, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మహారాష్ట్రలో అమలులో ఉంది. అయినా యథేచ్ఛగా బెట్టింగ్ సాగుతోంది. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ జోరు పెరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.