రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు పీఎం కిసాన్ నిధి కింద నిధులను విడుదల చేసేందుకు కేంద్రం సిద్దమైంది. జూన్ 18న వారాణాసిలో మొత్తం రూ.20,000 కోట్లను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. జూన్ 18న రూ.2వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అదే రోజు 30,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు కృషి సఖీలుగా సర్టిఫికెట్లు అందించనున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.