టీ
కాంగ్రెస్ ఎన్నికల కమిటీని ఏఐసీసీ ఇవాళ ప్రకటించింది. ఈ కమిటీ చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డిని నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి సహ 25 మందికి చోటు కల్పించింది. భట్టి, జీవన్ రెడ్డి, ఉత్తమ్, రాజనర్సింహా, జానారెడ్డి, వీహెచ్, వంశీచంద్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి, సీతక్క, మధుయాష్కీ గౌడ్ తదతరులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెకట్రరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.