పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గురువారం ఘోర ఘటన జరిగింది. బురదలో పోలీసు మొబైల్ వ్యాన్లు చిక్కుకుపోవడంతో.. దుండగులు పోలీసులపై రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడిలో 11మంది పోలీస్ అధికారులు మృతి చెందారు. 7 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బందీలుగా పట్టుబడ్డారని పంజాబ్ పోలీసు ప్రతినిధి ఒకరు వివరించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.