పోలీసు కాన్వాయ్‌పై రాకెట్ దాడి.. 11 మంది పోలీసులు మృతి

54చూసినవారు
పోలీసు కాన్వాయ్‌పై రాకెట్ దాడి.. 11 మంది పోలీసులు మృతి
పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో గురువారం ఘోర ఘటన జరిగింది. బురదలో పోలీసు మొబైల్‌ వ్యాన్లు చిక్కుకుపోవడంతో.. దుండగులు పోలీసులపై రాకెట్లతో దాడి చేశారు. ఈ దాడిలో 11మంది పోలీస్ అధికారులు మృతి చెందారు. 7 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు బందీలుగా పట్టుబడ్డారని పంజాబ్‌ పోలీసు ప్రతినిధి ఒకరు వివరించారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్