టీ20 వరల్డ్కప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. ఐర్లాండ్తో మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పేస్ బౌలర్ జోష్ లిటిల్ బౌలింగ్లో రోహిత్కు బంతి బలంగా తగిలింది. 9వ ఓవర్ రెండో బంతి రోహిత్ చేయికి తగలగా, 10వ ఓవర్లో అతను గ్రౌండ్ నుంచి వెళ్లిపోయారు. ఆ గాయం సీరియస్గా లేదని, మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ చెప్పారు. అయితే కాస్త నొప్పిగా ఉందని వెల్లడించారు.