గుజరాత్లోని ఓ టీ వ్యాపారికి ఐటీ శాఖ రూ.49 కోట్లకు నోటీసు పంపించింది. పటాన్ జిల్లాలోని నవగంజ్ మార్కెట్లో ఖేమ్రాజ్ దేవ్ టీ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు నోటీసులు రావడంతో ఖంగుతిని, మోసపోయానని గుర్తించాడు. కొన్నేళ్ల క్రితం బ్రోకరేజ్ వ్యాపారం చేస్తున్న అల్పేశ్, విపుల్ పటేల్ ఇద్దరూ తన పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించారని, వారే తనను మోసం చేశారని తెలిపాడు.