BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఇవాళ భేటీ అయ్యారు. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో వీరు సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో
కేసీఆర్-ప్రవీణ్ సమావేశమవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈభేటీలో లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటాయని తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూల్ నుండి పోటీ చేయనుండగా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని సమాచారం.