TG: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొని దంపతులతో పాటు వారి ఎనిమిదేళ్ల కుమార్తె మృతిచెందారు. మృతులను గడ్డం రవీందర్, రేణుక, రితికగా గుర్తించారు. మృతులను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠకాయపాలెం వాసులుగా గుర్తించారు.