యూపీలోని మీరట్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ దారుణ హత్య సంచలనం రేపింది. మార్చి 04న సౌరభ్ ని అతడి భార్య ముస్కాన్, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి హత్య చేసి.. మృత దేహాన్ని ముక్కలుగా నరికారు. ఈ కేసులో నిందితులిద్దనిరిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, వీరిద్దరు జైలులో డ్రగ్స్ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ లేనిదే ఆహారం తీసుకోమని చెబుతున్నట్లు జైలు వర్గాల సమాచారం.