కాలనీ వాసుల్లో త్రాగునీటి కష్టాలు

59చూసినవారు
కాలనీ వాసుల్లో త్రాగునీటి కష్టాలు
రాయికోడ్ మండల కేంద్రమైన ముమ్మాదేవి కాలనీలో శుక్రవారం తాగునీటి కోసం హరిగోస పడుతున్నామని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు కొన్ని రోజుల నుంచి రావడం లేదని స్థానికులు అన్నారు. అధికారులకు చెప్పిన పెడిచెవిన పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్