పెళ్లి నుంచి తిరిగి వస్తూ ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆందోళన మండలం మాన్సాన్ పల్లి గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు గాయపడిన వారికి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మెరిగైన చికిత్స అందిస్తున్నారు.