పాముకాటుకు గురై బాలుడి మృతి
పాము కాటుకు గురై బాలుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం లక్ష్మాపూర్లో చోటుచేసుకుంది. భానోత్ కిరణ్(14)మృతి చెందాడు. మృతుడి తండ్రి రవి వివరాలు.. గురువారం రాత్రి 9. గంటలకు కుటుంబ సభ్యులు భోజనం చేసి వాకిట్లో నిద్రిస్తుండగా కుమారుడు అరవడంతో లేచి చూసే సరికి పామును గమనించామన్నారు. వెంటనే చికిత్స కోసం నర్సాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారని అన్నారు.