IPL-2025లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ ప్రకారం సెకండ్ బ్యాటింగ్ చేయడం అనుకూలమని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపారు.