ఎప్సెట్ ఫలితాల్లో గిరిజన బిడ్డ సత్తా
సంగారెడ్డి జిల్లా ఈఏపీసెట్ ఫలితాలు విడుదల కాగా కంగ్టి మండల తడ్కల్ ఎడ్లరెగడి తండాకు చెందిన విద్యార్థి మంచి ర్యాంకుతో సత్తాచాటారు. ఎడ్లరెగడి తండా జాదవ్ సతీష్ 5437వ ర్యాంకును సాధించారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో తాను మంచి ర్యాంకు సాధించానని తెలిపారు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా ఉన్నత స్థాయికి ఎదగడమే తన జీవిత లక్ష్యమని తెలిపారు. ఆదివారం తండా వాసులు అభినందించారు.