బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో భయానక ఘటన వెలుగుచూసింది. సంతానం కోసం ఓ వ్యక్తిని నరబలి ఇచ్చారు. సుధీర్ పాశ్వాన్ అనే వ్యక్తి తనకు సంతానం కలిగేలా పూజలు చేయాలని రిక్యాస్, ధర్మేంద్రను ఆశ్రయించాడు. ఈ క్రమంలో వీరిద్దరూ నరబలి ఇవ్వాలని నిర్ణయించుకొని యుగుల్ యాదవ్ (65)ను కిడ్నాప్ చేసి తల నరికారు. తర్వాత ఆ తలను హోలీ మంటల్లో కాల్చేశారు. యాదవ్ మిస్సింగ్పై ఫిర్యాదు అందగా విచారణలో ఈ హత్య విషయాలు బయటపడ్డాయి.