నారాయణఖేడ్ మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా పనులను మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ స్వరూప్ శెట్కార్ శుక్రవారం పరిశీలించారు. వేసవికాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాలని, అందుకోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని, నిరంతరం పారిశుధ్యం నిర్వహించాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఆయనతో పాటు శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.