ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేసిన పోలీసులు

63చూసినవారు
వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 4 వాహనాలను సీజ్ చేసినట్లు సిర్గాపూర్ ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం సిర్గాపూర్ గ్రామంలోని శివాజీ చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. వాహనదారులు వాహనం నడిపేటప్పుడు ఆర్సి, లైసెన్సు, ఇన్సూరెన్స్, హెల్మెట్ కలిగి ఉండాలని లేదా ఫోన్ లో అయినా చూపించాలి అన్నారు. లేని యెడల అట్టి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది అన్నారు.

సంబంధిత పోస్ట్