పటాన్ చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు కుటుంబ సభ్యులు ఆలయానికి 20 ఏళ్ల తర్వాత 4 కిలోల వెండి కిరీటాలు ఆభరణాలను భాజా భజంతిలతో ఊరేగింపు నిర్వహించి అందజేశారు. దీంతో వారు మరోసారి భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఇందులో ఫౌండేషన్ కోపౌండర్ పృథ్వీరాజ్ పాల్గొన్నారు.