సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో ఉన్న పీఎస్ఆర్ గార్డెన్లో ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలపై ఆదివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల శిక్షకులు కళింగ కృష్ణకుమార్ ఈవీఎంల పనితీరుపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. సిబ్బందికి సందేహాలు ఉంటే నివృత్తి చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, సాధారణ ఎన్నికల పరిశీలకులు గోపాల్జి తివారి పాల్గొన్నారు.