పవన్‌ను నిలదీసిన వైసీపీ నేత

67చూసినవారు
పవన్‌ను నిలదీసిన వైసీపీ నేత
వైసీపీ నేత పోతిన మహేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. నిన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నేత పోతిన మహేష్ స్పందించారు. విజయవాడలో బుడమేరు వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలకు తాను వెళ్తే అంతరాయం కలుగుతుందని పవన్ చెప్పుకొచ్చారు. అదే లాజిక్ పిఠాపురంలో వర్తించదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పిఠాపురానికి మంత్రా? ఏపీకి మంత్రా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్