పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు నగదు బహుమతి ప్రకటన

79చూసినవారు
పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు నగదు బహుమతి ప్రకటన
పారిస్ పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బంగారు పతక విజేతలకు రూ.75 లక్షలు, రజత విజేతలకు రూ.50 లక్షలు, కాంస్యం సాధించిన అథ్లెట్లకు రూ.30 లక్షల చొప్పున రివార్డులు అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ప్రకటన చేశారు. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో రాణించిన వారికి రూ. 22.5 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్