పదవులు శాశ్వతం కాదు.. కలుపుకొని పోదాం: ఎంపీ

53చూసినవారు
పదవులు శాశ్వతం కాదు.. కలుపుకొని పోదాం: ఎంపీ
పదవులు శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులే శాశ్వతమని ఆదివారం జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ అన్నారు. నేడు నారాయణఖేడ్ మాజి ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి తొమ్మిదవ వర్ధంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కిష్టారెడ్డికి తనతో ఉన్న మంచి బంధాన్ని గుర్తు చేశారు. ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. జహీరాబాద్ ఎంపీగా, నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కలలు నిజం చేశామన్నారు.

సంబంధిత పోస్ట్